Telangana: వాసాలమర్రిలో దళితబంధు రూ.7.60 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ

* వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు రూ.7.60 కోట్లు విడుదల * దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నిధులు

Update: 2021-08-05 07:53 GMT

కెసిఆర్(ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణలో దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. మొదటి విడతలో భాగంగా సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. వాసాలమర్రిలో దళిత బంధు పథకం అమలు చేస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ సర్కార్‌. 76 దళిత కుటుంబాలకు 7కోట్ల 60 లక్షల నిధులు విడుదల చేసింది. వాసాల మర్రిలోని ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షలు చొప్పున నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Tags:    

Similar News