తెలంగాణలో మళ్లీ ఐఏఎస్ ల బదిలీలు.. వెయిటింగ్ లో ఉన్న ఐదుగురికి పోస్టింగులు
తెలంగాణలో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఐదుగురు అధికారులను బదిలీ చేస్తూ పోస్టింగ్లు ఇచ్చారు. వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్లకు తెలంగాణ ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది.
పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా అనితారాజేంద్ర, టీఆర్ఎల్డీ స్పెషల్ సెక్రటరీగా విజయేంద్ర, ట్రాన్స్పోర్టు కమిషనర్గా ఎంఆర్ఎం రావు, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ టెక్నాలజీ జాయింట్ సెక్రటరీగా ఎం.ప్రశాంతిని నియమించారు. అలాగే, ఆర్థికశాఖ సెక్రటరీ రోనాల్డ్ రాస్కు గనులు, భూగర్భశాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది. దాంతో, గనులు, భూగర్భశాఖ నుంచి జయేష్ రంజన్ ను రవాణాశాఖ కమిషనర్ నుంచి సునీల్ శర్మను ప్రభుత్వం రిలీవ్ చేసింది.