Education Department on Private Schools: ప్రయివేటు పాఠశాలలపై విద్యాశాఖ కొరఢా

Education Department on Private Schools: తెలంగాణ విద్యాశాఖ అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై నిఘా పెట్టారు.

Update: 2020-07-09 11:00 GMT

Education Department on Private Schools: తెలంగాణ విద్యాశాఖ అధికారులు నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై నిఘా పెట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని గీతాంజలి స్కూల్‌, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ రెండు పాఠశాలలు మాత్రమే కాకుండా నగరంలోని మరో 15 పాఠశాలల్లో అధికారులు తనిఖీలు నిర్వహించినట్లుగా హైదరాబాద్ డీఈవో వెంకట నరసమ్మ తెలిపారు. అధికారులు చేసిన ఈ తనిఖీల్లో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, గీతాంజలి స్కూల్స్ యాజమాన్యం ప్రభుత్వం అమలు చేసిన నిబంధనల ఉల్లంఘంచినట్లుగా గుర్తించామని తెలిపారు. విద్యార్ధుల ట్యూషన్ ఫీజు, టెర్మె ఫీజులను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ని ఉల్లంఘిస్తున్నారు అని అన్నారు.

ఈ క్రమంలోనే ఈ రెండు పాఠశాలలకు అధికారులు నోటీసులు జారీచేశారని తెలిపారు. తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పాఠశాలల యాజమాన్యాలు రికార్డులను పూర్తి స్థాయిలో ఇవ్వలేదని అన్నారు. స్కూల్స్ రికార్డులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత పాఠశాలల్లో ఏ ఉల్లంఘనలు జరిగాయో వెల్లడిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి అన్ని పత్రాలను ఇవ్వాల్సిన బాధ్యత ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై ఉందన్నారు.  

Tags:    

Similar News