CM Revanth Reddy: ఇవాళ నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించనున్నారు.
CM Revanth Reddy: ఇవాళ నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థా్పనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. దేవరకొండ శివారులోని శేరిపల్లి దగ్గర ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. మహిళా సంగాలకు బ్యాంకు లింకేజీలో భాగంగా 11.33 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేయనున్నారు. దేవరకొండలోని బీఎన్ఆర్ కాలనీలో రెండు కోట్లలతో పార్కు నిర్మాణం, ప్రభుత్వ బాలుర కాలేజీలో రెండు కోట్లతో స్టేడియం, వాకింగ్ ట్రాక్ నిర్మాణం, రెండున్నర కోట్లతో భూగర్భ డ్రైనేజీ పనులకు సీఎం శంకు స్థాపన చేయనున్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్రపవార్, ఎమ్మెల్యే బాలు నాయక్ పరిశీలించారు. సీఎం రేవంత్ పర్యటనలో జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇంఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొంటారు.