తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కాసేపట్లో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ప్రగతిభవన్లో నిర్వహించతలపెట్టిన ఈ సమావేశానికి మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో ప్రబలుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై చర్చించనున్నారు. మొన్నటి వరకు రాజధాని హైదరాబాద్కే పరిమితమైన కరోనా ప్రస్తుతం జిల్లాలకు కూడా పాకడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు..? ఏదైనా కీలకమైన ప్రకటన చేస్తారా..? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.