గ్రాండ్గా సీఎం కేసీఆర్ భర్త్డే వేడుకలు.. ప్రగతి భవన్కు క్యూకట్టిన నేతలు !
రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినూత్న కార్యక్రమాలతో కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రగతిభవన్కు కేసీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి నేతలు క్యూకడుతున్నారు. మంత్రి తలసాని ఆధ్వర్యంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ బర్త్డే కేక్లను కట్ చేస్తున్నారు.
హైదరాబాద్ కుషాయిగూడ చర్లపల్లి డివిజన్లో సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా నగర మేయర్ సతీమణి శ్రీదేవి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చారు. బల్కంపేట ఎల్లమ్మగుడిలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ సంతోష్కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఇటు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రామకోటి రామరాజు 66 కిలోల బియ్యంతో వేసిన కేసీఆర్ చిత్రపట్టం ఆకట్టుకుంటుంది.
నల్గొండ జిల్లాలోని ఎన్జీ కాలేజ్ దగ్గర టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా 2కె రన్ను చేపట్టారు. ఈ 2కె రన్లో నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ సైదిరెడ్డి పాల్గొన్నారు.