తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేత మల్లు భట్టివిక్రమార్క టీఆర్ఎస్ మరోసారి మండిపడ్డారు. రాష్ట్ర సాధనకు ముందు, సాధించిన తర్వాత తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ వంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడిన అధికార పార్టీ నాయకులు ఇప్పుడు వాటి సంగతి పక్కనపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు అవినీతిలో మునిగి తేలుతున్నారని భట్టివిక్రమార్క అన్నారు. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తానంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దాని ద్వారా ఎన్ని ఎకరాలకు నీరిస్తున్నారో స్పష్టం చేయాలని కోరారు. కాళేశ్వరం అవినీతికి కేరాఫ్గా మారిందని ఎండగట్టారు. కేవలం మేడిగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేసి, అన్నారం ప్రాజెక్ట్లోని నీళ్లు పంపింగ్ చేస్తారు 15 శాతం కూడా పనులు పూర్తి చేయకుండా ప్రారంభోత్సవం చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు.