Rahul Gandhi: రాహుల్‌గాంధీని కలిసిన టి-కాంగ్రెస్ నేతలు

Rahul Gandhi: గురువారం కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి

Update: 2023-09-29 05:14 GMT

Rahul Gandhi: రాహుల్‌గాంధీని కలిసిన టి-కాంగ్రెస్ నేతలు

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కలిశారు. ఇటీవల బీఆర్ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన మైనంపల్లి తన కుమారుడితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక, ఖర్గే సమక్షంలో గురువారం మైనంపల్లి కుమారుడు రోహిత్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ పార్టీలో చేరారు. రాహుల్‌ను కలిసిన వారిలో తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఉన్నారు.

Tags:    

Similar News