Telangana: ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నలుగురి ప్రమాణ స్వీకారం

Telangana: శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం

Update: 2022-02-21 09:12 GMT

ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నలుగురి ప్రమాణ స్వీకారం

Telangana: ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన భాను ప్రసాదరావు ప్రమాణస్వీకారం చేశారు. అలాగే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కోటిరెడ్డి, దండే విఠల్ కూడా ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకాం చేశారు. శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో ప్రోటెం ఛైర్మన్ జాప్రీ వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీలను గంగుల కమాలకర్, మహమూద్ అలీ అభినందించారు.

Tags:    

Similar News