TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. మొత్తం 88 మంది అరెస్ట్

TSPSC: ములుగు ఫారెస్ట్ యూనివర్శిటీలో PHD చేస్తున్న మణికంఠ అరెస్ట్‌

Update: 2023-07-14 08:44 GMT

TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. మొత్తం 88 మంది అరెస్ట్

TSPSC: TSPSC పేపర్ లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మరో ఐదుగురు నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. తాజా అరెస్టులతో ఈ కేసులో మొత్తం 88 మంది అరెస్ట్ అయ్యారు. ములుగు ఫారెస్ట్ యూనివర్శిటీలో PHD చేస్తున్న కామారెడ్డి జిల్లాకు చెందిన మణికంఠ, ఖమ్మం జిల్లాకు చెందిన మొక్కల ప్రవీణ్ కుమార్, హనుమకొండకు చెందిన తాళ్లపల్లి సాయిదీప్, గణేష్‌ను అరెస్ట్ చేశారు. DAO పరీక్షలో మాస్ కాపీయింగ్ కోసం AE పూల రమేశ్‌కు మణికంఠ 2 లక్షల రూపాయలు చెల్లించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మిగిలిన వారంతా AE ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

Tags:    

Similar News