మీకేమైనా స్పెషల్ రూల్స్ ఉన్నాయా.. లాక్‌డౌన్ పట్టించుకోని జనంపై శివాలెత్తిన కలెక్టర్

Update: 2020-03-23 09:45 GMT

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న లాక్‌డౌన్ కు ప్రజల మద్దతు కరువు అయింది. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా బయటకు వచ్చిన ప్రజలపై రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సీరియస్ అయ్యారు. లాక్‌డౌన్‌ను పట్టించుకోకుండా జనం రోడ్లపైకి రావడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వారిని ఆపి మరీ క్లాస్ తీసుకుంటున్నారు.

రూల్స్ అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్న కార్లను, ఆటోలను ఆపి ఫైన్ వేశారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రావొద్దు అన్నారు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అని కలెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. వాహనాలను వెనక్కి పంపించే క్రమంలో వాహనదారులపై కృష్ణ భాస్కర్ శివాలెత్తారు. ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే వారిని అరెస్ట్ కూడా చేయిస్తున్నారు. 


Full View


Tags:    

Similar News