Telangana: తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు

* తనను బలిపశువును చేశారంటూ బండి సంజయ్, కిషన్‌రెడ్డికి సంఘ్‌ పరివార్‌కు పేరాల శేఖర్‌రావు బహిరంగ లేఖ

Update: 2021-10-08 07:51 GMT

తెలంగాణ బీజేపీ (ఫైల్ ఫోటో)

Telangana BJP: తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. బీజేపీలో ఓ లేఖ కలకలం సృష్టిస్తోంది. బీజేపీలో మరోసారి లింగోజిగూడ ప్రగతిభవన్ ప్రకంపనలు వెలుగులోకి వచ్చింది. తనను బలిపశువును చేశారంటూ బండి సంజయ్, కిషన్‌రెడ్డికి సంఘ్‌ పరివార్‌కు పేరాల శేఖర్‌రావు బహిరంగ లేఖ రాశారు. లింగోజిగూడ ఏకగ్రీవం కోసం ప్రగతిభవన్ వెళ్లిన సందర్భంగా ఏం జరిగిందో వివరిస్తూ పేరాల శేఖర్ రావు లేఖ రాశారు. పార్టీలో టీమ్ స్పిరిట్‌ కొరవడిందని వ్యక్తిగతంగా కానీ, మీటింగ్‌లో కానీ స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు పేరాల శేఖర్‌.

Tags:    

Similar News