సికింద్రాబాద్‌ నేరెడ్‌మెట్‌లో దారుణం.. జేజే నగర్‎లోని గ్రేస్ అనాథాశ్రమంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు

Secunderabad: ఈ నెల 19న ఆశ్రమంలో కనిపించకుండా పోయిన నలుగురు యువతులు

Update: 2022-10-26 05:25 GMT

సికింద్రాబాద్‌ నేరెడ్‌మెట్‌లో దారుణం.. జేజే నగర్‎లోని గ్రేస్ అనాథాశ్రమంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు

Secunderabad: సికింద్రాబాద్ నేరెడ్‌మెట్‎లో దారుణం జరిగింది. జేజే నగర్‎లోని గ్రేస్ అనాథాశ్రమంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నెల 19న ఆశ్రమంలో నలుగురు యువతులు కనిపించకుండా పోయారు. అందులో ఒకరు మేజర్, మరో ముగ్గురు మైనర్ బాలికలు ఉన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన నేరెడ్‌మెట్ పోలీసులు వారిని గుర్తించారు. ఇద్దరు సికింద్రాబాద్‎లో, మరో ఇద్దరు బంధువుల ఇంట్లో ఉన్నట్లు నిర్ధారించారు. వారిని సఖీ సెంటర్‎కు తరలించారు. సఖీ సెంటర్‎లో లైంగిక దాడి విషయాన్ని మైనర్‌ బాలిక పోలీసులకు వెల్లడించారు. ఆశ్రమంలో అకౌంటెంట్ మురళి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక ఆరోపించారు. బాలిక ఫిర్యాదుతో మురళితోపాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Full View
Tags:    

Similar News