మీర్‌పేట్‌ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు

*పక్కా స్కెచ్‌తో యువకుడిని హత్య చేయించిన శ్వేతారెడ్డి

Update: 2022-05-13 06:55 GMT

మీర్‌పేట్‌ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు

Meerpet: మీర్‌పేట్‌ మర్డర్‌ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫేస్‌‌బుక్‌ పరిచయం ప్రాణం తీసింది. పక్కా స్కెచ్‌తో యువకుడిని హత్య చేయించింది శ్వేతారెడ్డి. ఫేస్‌బుక్‌లో పరిచయమైన యశ్మకుమార్‌తో శ్వేతారెడ్డి న్యూడ్ కాల్స్‌ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే న్యూడ్‌ వీడియోలు చూపించి యశ్మకుమార్ పెళ్లి చేసుకోవాలని బ్లాక్‌మెయిల్ చేశాడు. పెళ్లి చేసుకోకపోతే న్యూడ్ వీడియోలు బయటపెడతానని బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు చెందిన కొంగల అశోక్‌‌కు యశ్మకుమార్‌ను చంపాలని శ్వేత కోరింది.

ఈనెల 4న యశ్మకుమార్‌ను ఇంటికి పిలిచిన శ్వేతారెడ్డి. అశోక్‌, కార్తీక్‌లకు యశ్మకుమార్‌ ఫోటో పంపింది. యశ్మకుమార్‌పై సుత్తితో దాడి హత్య చేశారు అశోక్, కార్తీక్. మొదటగా రోడ్డు ప్రమాదమని భావించిన పోలీసులు యాక్సిడెంట్ చేసిన వెహికిల్ కోసం సీసీ కెమెరాలో పరిశీలించారు. సీసీ కెమెరాలో యశ్మకుమార్‌ను హత్య చేస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. శ్వేతారెడ్డి ఫేస్‌బుక్, వివాహేతర సంబంధంతో హత్య జరిగినట్లు గుర్తించారు

Tags:    

Similar News