Seethakka: ఈ నెల 24,25 తేదీల్లో దళత గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్ష

* టీఆర్ఎస్ పాలనను ఎండగట్టేందుకు దీక్ష- ఎమ్మెల్యే సీతక్క

Update: 2021-08-22 16:00 GMT

సీతక్క (ఫైల్ ఫోటో)

Seethakka: మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించే "దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్ష" ప్రాంగణాన్ని ఎమ్మెల్యే సీతక్క. పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం వాగ్దానాలకే పరిమితమైందని మూడుచింతలపల్లిని దత్తత తీసుకుని ఏళ్ళు గడిచినా ఇప్పటివరకు ఏలాంటి అభివృద్ధి జరగలేదని సీతక్క విమర్శించారు. దళితులకు ఇస్తామన్న మూడు ఎకరాల భూమి కానీ ఇంటికో ఉద్యోగం గాని, ఉపాధి గాని కల్పించలేదని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పాలన తీరును ఎండగట్టేందుకు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News