Bandi Sanjay: సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే..

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-06-18 11:16 GMT

Bandi Sanjay: సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రే..

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా శక్తికేంద్రాల జిల్లా శక్తికేంద్రాల ఇన్‌ఛార్జిలతో సమావేశం నిర్వహించారు. తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రత్యేకంగా ప్రస్తవనకు తెచ్చారు. రకరకాల పద్ధతుల్లో రాష్ట్రప్రభుత్వం ప్రతినిధులు కేంద్రంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రేనన్నారు. వేల మంది స్టేషన్‌ దగ్గర గుమిగూడుతుంటే.. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఏం చేస్తోంది అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం దుర్మా ర్గం అని మండిపడ్డారు.

Tags:    

Similar News