సికింద్రాబాద్లో దారుణం.. 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
సికింద్రాబాద్లో దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్లోని లాడ్జిలో ఓ మైనర్ బాలికపై ఆరుగురు నిందితులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు.
సికింద్రాబాద్లో దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్లోని లాడ్జిలో ఓ మైనర్ బాలికపై ఆరుగురు నిందితులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. సంగారెడ్డికి చెందిన 13 ఏళ్ల బాలిక ఈ నెల 4న కనిపించకుండా పోయింది. సికింద్రాబాద్లో ఎటు వెళ్లాలో తెలియక రోడ్డుపై తిరుగుతుండగా కొందరు యువకులు బాలికను ఇంటికి తీసుకెళ్తామంటూ లాడ్జ్కు తీసుకెళ్లారు. సికింద్రాబాద్లోని ఓ లాడ్జిలో బంధించి బాలికపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బాలికను గుర్తించిన పోలీసులు ఇద్దరు మైనర్లు, నలుగురు యువకులను అరెస్టు చేశారు. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించి మైనర్లను జువైనల్ హోంకు పంపించారు.