Shilpa Chowdary: రెండో రోజు కొనసాగుతున్న శిల్పా చౌదరి విచారణ

Shilpa Chowdary: నేను ఎవరినీ మోసం చేయలేదు -శిల్పా చౌదరి

Update: 2021-12-04 10:06 GMT

కొనసాగుతున్న శిల్ప చౌదరి కేసు విచారణ (ఫైల్ ఇమేజ్)

Shilpa Chowdary: రెండో రోజు శిల్పా చౌదరి విచారణ కొనసాగుతోంది. విచారణలో పలు విషయాలు వెల్లడించారు శిల్పా చౌదరి. తానెవరినీ మోసం చేయలేదని ఎక్కడికీ పారిపోవడం లేదని తెలిపింది. చాలా మంది బ్లాక్ మనీని వైట్ చేయమని తనకు ఇచ్చినట్లు విచారణలో వెల్లడించారు. ఆ డబ్బులను రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్‌లో పెట్టిన పెట్టుబడులు తిరిగి రాలేదని అందుకే డబ్బులు చెల్లించలేకపోయానని వెల్లడించారు. డబ్బులు ఇవ్వకుండా సింగపూర్ వెళ్తున్నాననడం అవాస్తవమని తనకు డబ్బులు ఇచ్చిన అందరికి తిరిగి చెల్లిస్తానని విచారణలో శిల్పా చౌదరి వెల్లడించింది. 

Tags:    

Similar News