ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు. సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపు అన్ని డిపోల వద్ద సేవ్ ఆర్టీసీ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు. ప్రైవేట్ రూట్ల అంశంపై కోర్టు తీర్పు అనంతరం సీఎం కేసీఆర్ ఓ కీలక ప్రకటన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు. తాము విధులకు చేరేందుకు సిద్ధంగా ఉన్నా అధికారులు డిపోల్లోకి అనుమతించడంలేదంటున్నారు కార్మికులు.