Unity March: జాతిని ఏకం చేసిన సర్దార్ పటేల్కు యూనిటీ మార్చ్గా శ్రద్ధాంజలి – బండి సంజయ్
సర్దార్ దేశం కోసం చేసిన పోరాటాలని భావితరాలకు తెలియజేయాలన్న స్పూర్తితో,.. దేశవ్యాప్తంగా యూనిటీ మార్చ్ను నిర్వహిస్తున్నాం - కేంద్రమంత్రి బండి సంజయ్
Unity March: జాతిని ఏకం చేసిన సర్దార్ పటేల్కు యూనిటీ మార్చ్గా శ్రద్ధాంజలి – బండి సంజయ్
దేశాన్ని ఏకం చేసిన మహానీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కేంద్రమంత్రి బండిసంజయ్ అన్నారు. దేశం కోసం సర్దార్ చేసిన పోరాటాలని భావితరాలకు తెలియజేయాలన్న స్పూర్తితో.. దేశవ్యాప్తంగా యూనిటీ మార్చ్ను చేపట్టామన్నారు. ఆపరేషన్ పోలో పేరుతో తెలంగాణకు విముక్తి కలిగించిన మహానియుడు సర్దార్ అని కొనియాడారు. ఆధునిక సివిల్స్ సర్వీసెస్ను స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించిన సర్ధార్ను స్పూర్తిగా తీసుకోవాలని, యూనిటీ మార్చ్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రామన్ని ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు.