సత్తుపల్లిలో విషాదం.. ఆర్టీసీ మహిళా కండక్టర్ ఆత్మహత్య

Update: 2019-10-28 07:44 GMT

తెలంగాణలో మరో ఆర్టీసీ కార్మికురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన నీరజ అనే కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే నీరజ ఆత్మహత్యకు పాల్పడిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్ నెల జీతాలు ఇంత వరకు రాకపోవడం మరో రెండు రోజులు గడిస్తే రెండో నెల కూడా పూర్తవుతూ ఉండటంతో ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. 

Tags:    

Similar News