రేపటి నుంచి ఉధృతంకానున్న ఆర్టీసీ సమ్మె
రేపటి నుంచి ఉధృతంకానున్న ఆర్టీసీ సమ్మె ప్రొ.కోదండరామ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ రేపు ఉదయం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో చర్చ హాజరుకానున్న విద్యార్థి, ప్రజా సంఘాలు రేపు అన్నీ జిల్లాల్లో రాజకీయ నాయకులతో జేఏసీ భేటీ సమ్మెకు అన్నీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మద్దతు ప్రత్యక్ష పోరాటం చేస్తామంటోన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు
రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతం కానుంది. రేపు ఉదయం 10 గంటలకు సోమాజిగూడా ప్రెస్ క్లబ్ ఆర్టీసీ జేఏసీ నాయకులు సమావేశం కానున్నారు. అలాగే ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన అన్ని పార్టీల నాయకులతో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు హాజరుకానున్నాయి. రేపు అన్ని జిల్లాల్లో కూడా రాజకీయ నాయకులతో ఆర్టీసీ ఉద్యోగులు సమావేశం కానున్నారు. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ సమ్మెకు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు ప్రత్యక్ష పోరాటానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి.