తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట లభించింది. గతనెల వేతనాలు చెల్లించేందుకు ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. ఆర్టీసీ కార్మికులకు సోమవారం లోపు జీతాలు చెల్లించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. తమకు వేతనాలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కార్మికులు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు ఈ రోజు విచారించింది. 49 వేల 190 మంది ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదంటూ కార్మికుల తరపు న్యాయవాది హైకోర్టుకు సూచించారు. అయితే సిబ్బంది సమ్మెలో ఉండటం వల్లే జీతాలు చెల్లింపు ఆలస్యమయ్యిందని ఆర్టీసీ తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. సోమవారం లోపు జీతాలు చెల్లించే ప్రయత్నాలు చేస్తున్నట్టు కోర్టుకు వివరించారు.