ప్రతి ఒక్కరికీ బాధను చెప్పుకునే హక్కు ఉంది.. సమ్మెపై కేసీఆర్‌తో చర్చిస్తా: పవన్‌

Update: 2019-10-31 10:17 GMT

తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు, తమ పోరాటానికి మద్దతు కోరుతూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. 27 రోజుల పాటు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదంటూ పవన్ కు తెలిపారు. 27 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండడం బాధాకరమైన విషయం అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 16 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోవడం చాలా భాదకరం అన్నారు పవన్.

ప్రతి ఒక్కరికీ బాధను చెప్పుకునే హక్కు ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, కేవలం 48 వేల మంది సమస్య కాదు వారి కుటుంబాలది కూడా అని తెలిపారు. సీఎం కేసీఆర్ పై తనకు గట్టి నమ్మకం ఉందని, కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పవన్ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. సమ్మె విషయమై సీఎం కేసీఆర్ తో మాట్లాడతానని, అప్పటికీ కేసీఆర్ పట్టించుకోకపోతే ఆర్టీసీ కార్మికులు భవిష్యత్ లో నిర్వహించే కార్యక్రమాలకు తాను పూర్తిగా మద్దతు ఇస్తానని వెల్లడించారు.

Tags:    

Similar News