ఆర్టీసీని విలీనం చేస్తామంటేనే చర్చలకు వస్తాం : అశ్వద్ధామరెడ్డి

Update: 2019-10-14 10:56 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కేసీఆర్ బెదిరింపులు, మంత్రుల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులపై పోలీసుల దమనకాండపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే, ఎవరు పిలిచినా చర్చలకు వెళ్తామని, కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇస్తేనే చర్చలకు వెళ్తామన్నారు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి.

Tags:    

Similar News