లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 10 మందికి స్వల్పగాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

Jayashankar Bhupalpally: క్షతగాత్రులను మహదేవ్‌పూర్‌ ఆస్పత్రికి తరలింపు...

Update: 2021-12-13 13:19 GMT

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 10 మందికి స్వల్పగాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

Jayashankar Bhupalpally: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చింతకాని క్రాస్‌ వద్ద ఇసుక లారీని వెనుక నుంచి ఢీకొంది. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మహదేవ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు.

కాళేశ్వరం నుంచి హన్మకొండ వెళ్తున్న బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు, స్థానికులు తిరగబడ్డారు.

Tags:    

Similar News