నాలుగు లారీలు.. ఒక బస్సు విధ్వంసం

Update: 2019-11-15 12:25 GMT

ముందు రెండు లారీలు వెనుక రెండు లారీలు మధ్యలో టీఎస్ ఆర్టీసీకి చెందిన రాజధాని బస్సు. కరీంనగర్ రూరల్ ఇరుకుల్ల గ్రామ శివారు రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాదం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. హైవేపై వస్తున్న ఓ లారీ ఆగి ఉన్న మరో లారీని ఢీ కొట్టింది. ఆ వెనకాలే వస్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు రెండో లారీని ఢీ కొట్టింది. ఆ వెంటనే బస్సును వరుసగా రెండు లారీలు ఢీ కొట్టాయి.

ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే లారీల మధ్య ఇరుక్కుపోవడంతో బస్సు డోర్‌ తెరుచుకోలేదు. దీంతో ప్రయాణీకులంతా అత్యవసర ద్వారాల గుండా బయటకువచ్చారు. అద్దాలను పగులగొట్టి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనతో కరీంనగర్, రామగుండం హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

keywords  : karimnagar, road accident

Tags:    

Similar News