Road Accident: కొడంగల్‌ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం

Road Accident: రెండు కార్లు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

Update: 2021-06-19 07:37 GMT

Representational Image

Road Accident: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌ బీజాపూర్‌ జాతీయ రహదారిపై బండల ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి చెందగా మరొక వ్యక్తి ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News