మల్లన్న సాగర్ నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం.. ఆర్డీవో,తహశీల్దార్లకు 2 నెలల జైలు శిక్ష..
మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్దిపేట జిల్లా తొగుట ఆర్డీవో, తహశీల్దార్కు 2 నెలల జైలు శిక్ష విధించింది.
మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై నిర్లక్ష్యం వహించిన అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్దిపేట జిల్లా తొగుట ఆర్డీవో, తహశీల్దార్కు 2 నెలల జైలు శిక్ష విధించింది. 2 నెలల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానాతో పాటు సస్పెన్షన్కు ఆదేశాలు జారీ చేసింది. భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలు పట్టించుకోలేదని మరోసారి కోర్టును బాధితులు ఆశ్రయించారు.