రంగారెడ్డి జిల్లాలో ప్రజా సంక్షేమ పాలన సదస్సు

Rangareddy: *కార్యక్రమానికి హాజరైన టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్

Update: 2022-06-13 07:21 GMT

రంగారెడ్డి జిల్లాలో ప్రజా సంక్షేమ పాలన సదస్సు

Rangareddy: రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ పతనం ప్రారంభమైందని, బీజేపీ ప్రభుత్వం రాబోతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోడీ 8 ఏళ్ల ప్రజా సంక్షేమ పాలన కార్యక్రమం రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు సామరంగారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ పాలనలో సంక్షేమ పథకాలపై చర్చించేందుకు తాను సిద్ధమని, కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని విమర్శించారు.

Tags:    

Similar News