CM Revanth Reddy: 2 కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చారు

CM Revanth Reddy: అదానీ, అంబానీ, అమెజాన్ ఒత్తిడిలకు బీజేపీ సర్కార్ లొంగిపోయింది

Update: 2024-04-25 08:26 GMT

CM Revanth Reddy: 2 కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చారు

CM Revanth Reddy: ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్‌ను కూడా అమలు చేయలేదని అన్నారు. అదానీ, అంబానీ, అమెజాన్ ఒత్తిడిలకు ఎన్డీయే సర్కార్ లొంగిపోయి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడితే పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ రైతులకు క్షమాపణ చెప్పారని అన్నారు. ప్రతి పేదవాడి ఖాతాల్లో 15 లక్షలు వేస్తానన్న మోడీ సర్కార్.. కనీసం 15 పైసలు కూడా వేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు.

Tags:    

Similar News