ఈ నెల 20న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే.. నేటితో అయన విడిది పూర్తి కానుంది. ఈ నేపధ్యంలో బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ సాయింత్రం ఎట్ హోం కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమానికి తెలంగాణా గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
ఇక రేపు(శనివారం) రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరిగి ఢిల్లీ పయనం కానున్నారు. ప్రతి ఏటా రాష్ట్రపతి శీతాకాలంలో దక్షిణాదికి విడిది కోసం వచ్చి వెళ్ళే ఆనవాయితీ ఉన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే శీతాకాల విడిది కోసం ఈ నెల 20న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ వచ్చాక.. ఈ నెల 23న మూడు రోజుల పర్యటన కోసం తమిళనాడు వెళ్లారు. మళ్లీ గురువారం హైదరాబాద్కు వచ్చారు.
President Kovind hosted an 'At Home' reception at Rashtrapati Nilayam, Secunderabad, Telangana. pic.twitter.com/ap9N40C3Dp
— President of India (@rashtrapatibhvn) December 27, ౨౦౧౯