డిసెంబర్ 26న సంపూర్ణ సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలన్ని మూసివేయనున్నారు. అనంతరం మరుసటి రోజు భక్తుల దర్శనం కోసం ఆలయ తలుపులు తెరవనున్నారు. రేపు సూర్యగ్రహణం ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సమయంలో ఆలయాలన్నీ మూసివేస్తామన్నారు. గ్రహణ సమయంలో గర్భిణి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొంత మంది గ్రహనాన్ని చూడవచ్చని అంటున్నారు కానీ పురాతన సాంస్కృతి ప్రకారం అలాంటివి చూడటం వలన కిరణాల ప్రభావంతో చేడు జరుగుతుందంటున్నారు ఆలయ అర్చకుల.