Revanth Reddy: కేసీఆర్ పతనానికి పొంగులేటి, జూపల్లి పునాదులు వేస్తున్నారు..
Revanth Reddy: ఖమ్మం బహిరంగ సభతో యుద్ధం మొదలవుతుంది
Revanth Reddy: కేసీఆర్ పతనానికి పొంగులేటి, జూపల్లి పునాదులు వేస్తున్నారు..
Revanth Reddy: కర్నాటక రిజల్ట్ ఇచ్చిన బూస్ట్తో యాక్టివ్ అయిన తెలంగాణ హస్తం పార్టీ నేతలు అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రధానంగా చేరికలపై ఫోకస్ చేసిన టీ కాంగ్రెస్..కలిసివచ్చే నాయకులతో చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగానే మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లితో టీ.పీసీసీచీఫ్ రేవంత్తో పాటు ముఖ్య నేతలు సమావేశమై కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. హస్తం పార్టీలో చేరేందుకు ఆ ఇద్దరు నేతలు సానుకూలంగా స్పందించినట్లు రేవంత్ తెలిపారు. ఇక.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాసిన కేసీఆర్ పాలనకు ఖమ్మంలో జరగబోయే సభతోనే చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు రేవంత్.