Hyderabad: పార్టీ సభ్యత్వం తీసుకుంటే.. 200 గజాల జాగా ఇస్తం

* జై మహాభారత్ పార్టీ ప్రెసిడెంట్‌పై కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు

Update: 2022-07-06 09:00 GMT

Hyderabad: పార్టీ సభ్యత్వం తీసుకుంటే.. 200 గజాల జాగా ఇస్తం

Hyderabad: జై మహాభారత్ పార్టీ ప్రెసిడెంట్ అనంత విష్ణు దేవా ప్రభుపై కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. వ్యక్తుల ఫోటోలు, ఆధార్ కార్డుల సేకరణపై కేసు పెట్టేందుకు పోలీసులు న్యాయ సలహా తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్‌కు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఎవరూ ఫిర్యాదు చేయని కారణంగా చర్యలు తీసుకోలేదని ఈసీ అధికారులు తెలిపారు.

జై మహాభారత్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఒక్కొక్కరికి 200 గజాల స్థలం ఇస్తామంటూ కార్యకర్తలు హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించారు. కాగా గతంలోనే హైదరాబాద్ పోలీసులకు జై మహాభారత్ పార్టీ కార్యకలాపాలపై ఫిర్యాదు అందింది.

Full View


Tags:    

Similar News