KA Paul: సెక్రటేరియట్లో జరిగిన అగ్నిప్రమాదంపై హైకోర్టులో పిల్
KA Paul: సీబీఐతో విచారణ జరపాలని కోరిన KA పాల్
KA Paul: సెక్రటేరియట్లో జరిగిన అగ్నిప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అంతేకాక తాను దాఖలు చేసిన పిల్ను విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని చీఫ్ జస్టిస్ బెంచ్కి పాల్ తెలిపారు. పాల్ దాఖలు చేసిన పిల్కు నెంబరింగ్ ఇవ్వాలని రిజస్టార్కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాల్ వేసిన పిల్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.