Vijaya Reddy: టీఆర్‌ఎస్‌కు పీజేఆర్‌ కూతురు విజయారెడ్డి గుడ్‌బై

Vijaya Reddy: రేవంత్‌రెడ్డితో పీజేఆర్‌ కూతురు విజయారెడ్డి భేటీ

Update: 2022-06-18 07:51 GMT

Vijaya Reddy: టీఆర్‌ఎస్‌కు పీజేఆర్‌ కూతురు విజయారెడ్డి గుడ్‌బై

Vijaya Reddy: టీఆర్‌ఎస్ పార్టీకి మరో నేత గుడ్ బై చెప్పారు. PJR కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా ఉన్న విజయారెడ్డి గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 23న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. PJR ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు విజయారెడ్డి తెలిపారు.

సోనియాగాంధీ నాయకత్వంలో ముందుకెళ్తానన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయమని వివరించారు. తమ కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్‌లోనే ఉందని ఆ పార్టీలోనే సాగితేనే బాగుంటుందని విజయారెడ్డి అన్నారు. అందరితో చర్చించాకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయారెడ్డి ప్రకటించారు.

Tags:    

Similar News