Telangana: నిత్య పెళ్లి కొడుకు ఆగడాలు.. భార్య ఉండగానే చనిపోయిందని చెప్పి మరో పెళ్లి

Telangana: ఆడపిల్లలు పుడుతున్నారని భార్యకు 4 సార్లు అబార్షన్

Update: 2024-02-20 08:24 GMT

Telangana: నిత్య పెళ్లి కొడుకు ఆగడాలు.. భార్య ఉండగానే చనిపోయిందని చెప్పి మరో పెళ్లి

Telangana: నిత్య పెళ్లికొడుడు ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. భార్య బతికి ఉండగానే చనిపోయిందని చెప్పి అమరేందర్ అనే వ్యక్తి మరో పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకుని తనకు న్యాయం చేయాలంటూ అమరేందర్ ఇంటి ముందు బాధితురాలు ధర్నాకు దిగింది. పిల్లల విషయంలోనూ అమరేందర్‌పై పలు ఆరోపణలు చేసింది. ఆడపిల్లలు పుడుతున్నారని 4 సార్లు అబార్షన్ చేయించారని వాపోయింది.. అమరేందర్ తండ్రి సైతం రిటైర్డ్ మెజిస్ట్రేట్ అని చెప్పి పలువురిని మోసం చేసిందని తెలిపింది. ఇప్పటికే సరూర్‌నగర్ మహిళా పీఎస్‌లో అమరేందర్ కేసునమోదు అయింది.

Tags:    

Similar News