బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దీక్ష భగ్నం.. క్షీణించిన ఆరోగ్యం.. కిషన్ రెడ్డి నిర్మల్ పర్యటన వాయిదా

Nirmal: నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేయాలని మహేశ్వర్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష

Update: 2023-08-21 04:03 GMT

బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దీక్ష భగ్నం.. క్షీణించిన ఆరోగ్యం.. కిషన్ రెడ్డి నిర్మల్ పర్యటన వాయిదా

Nirmal: నిర్మల్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి దీక్షను భగ్నం చేశారు. మహేశ్వర్‌రెడ్డిని పోలీసులు అంబులెన్స్‌లో తరలిస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు .మహేశ్వర్‌రెడ్డి ఆరోగ్య క్షీణించడంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నిర్మల్‌ మాస్టర్‌ ప్లాన్‌ను రద్దు చేయాలని మహేశ్వర్‌రెడ్డి ఆమరణ నిరహార దీక్షను చేపట్టారు. పోలీసులు దీక్ష భగ్నం చేయడంతో బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి నిర్మల్‌ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. 

Tags:    

Similar News