కార్లు లేవు గుర్రాలు అంతకన్నా లేవు. అయినా పెళ్లి ఊరేగింపు బ్రహ్మాండంగా జరిగింది. కారు, ఆటో, రిక్షా ఇలాంటి వాహనాల్లో మనం పెళ్లి ఊరేగింపు చూసి ఉంటాం. బారాత్ ఇలా కూడా జరుగుతుందా? అనేలా వధూవరులు జేసీబీలో ఊరేగారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మ్యాదరిపేట గ్రామంలో కొత్తగా పెళ్లైన జంటను కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ వినూత్నంగా ఊరేగించి కొత్త ట్రెండ్ సెట్ చేశారు.
మ్యాదరిపేట గ్రామానికి చెందిన వర్షిణి అదే మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన శశాంక్తో శుక్రవారం వివాహం జరిగింది. ఈ వేడుకలో జేసీబీని పువ్వులతో ముస్తాబు చేశారు. అనంతరం జేసీబీలో ముందు భాగంలో నూతన వధూవరులను కూర్చుండబెట్టి బ్యాండ్ వాయిద్యాల మధ్య ఊరేగింపు చేశారు. జేసీబీలో ఊరేగింపు చేస్తున్న విషయం తెలుసుకున్న ప్రజలు రోడ్ల పైకి వచ్చి వధూవరులను చూసి ఆనందం వ్యక్తం చేశారు.