మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కనుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రి నుంచి మినిస్టర్ క్వార్టర్స్కు నాయిని మృతదేహాన్ని తరలించారు. పార్టీ శ్రేణుల సందర్శనార్థం మినిస్టర్ క్వార్టర్స్లో నాయిని పార్థివదేహాన్ని ఉంచనున్నారు. ఇవాళ సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.