వారిని ముప్పు తిప్పలు పెడుతున్న నయీం కుటుంబ సభ్యులు

Update: 2020-02-25 15:01 GMT
వారిని ముప్పు తిప్పలు పెడుతున్న నయీం కుటుంబ సభ్యులు

నయీం కుటుంబ సభ్యులు ఐటీ అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇప్పటికే తొమ్మిది సార్లు నయీం కుటుంబసభ్యులకు ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నయీం భార్య, తల్లి, సోదరికి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై స్పందించలేదు. వెయ్యి కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి నయీం కుటుంబ సభ్యుల నుండి ఐటీ శాఖ అధికారులు వివరణ కోరారు. తాజాగా నయీం అనుచరుడు పాశం శ్రీనుకు నోటీసులు ఇచ్చారు. నయీం ఆస్తులకు సంబంధించి సిట్ నుంచి ఐటీ అధికారులు పూర్తి వివరాలు సేకరించారు.  

Tags:    

Similar News