మెట్రోలో ప్రయాణించిన నారా బ్రాహ్మణి, దేవాన్ష్‌

Update: 2019-08-18 09:20 GMT

హైదరాబాద్‌ మెట్రో రైలులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌ ప్రయాణించారు. ఆదివారం ఉదయం తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి బ్రాహ్మణి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి లక్డీకపూల్‌ మార్గంలో మెట్రోలో ప్రయాణించారు. మెట్రోలో ఇద్దర్ని చూసిన కొంతమంది ప్రయాణికులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. లక్డీ కపూల్ లో వీరిద్దరూ దిగేసరికే అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనంలో వెళ్లిపోయారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరిన బ్రాహ్మణి, మెట్రో రైల్ ప్రయాణించినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News