ములుగు కలెక్టర్ కార్యాలయంలో ఓ మహిళా రైతు హల్చల్ చేసింది. ఓ పెద్ద కర్రతో విజృంభించింది. తన వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్ బుక్ ఇవ్వకుండా 5 ఏళ్లుగా తిప్పుంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. లంచం ఇచ్చినా కూడా పని జరగడం లేదని కర్రతో వీరంగం సృష్టించింది.