Dharmapuri Arvind: సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారు

* మళ్లీ కేంద్రాన్ని నిధులు అడుగుతున్నారు * సీఎం కేసీఆర్‌‌కు పీఎం అపాయింట్‌మెంట్ ఇచ్చింది తెలంగాణ ప్రజల కోసం: అర్వింద్

Update: 2021-09-04 10:12 GMT

ధర్మపురి అరవింద్ - కెసిఆర్ (ఫైల్ ఫోటో)

Dharmapuri Arvind: సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీసి మళ్లీ కేంద్రాన్ని డబ్బులు అడుగుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. కేంద్రం ఇస్తున్న నిధులను కాళేశ్వరం, మిషన్ భగీరథ పేరుతో పక్కదారి పట్టించి కల్వకుంట్ల ఖాతాలోకి మల్లిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని సీఎం కేసీఆర్ కు అపాయింట్‌మెంట్ ఇచ్చింది 3.5 కోట్ల తెలంగాణ ప్రజల కోసమే అని స్పష్టం చేశారు. బండి సంజయ్ పాదయాత్ర చూసి సీఎం కేసీఆర్‌కు చలి జ్వరం వచ్చిందని, అందుకే ఢిల్లీకి వెళ్లారన్నారు.

Tags:    

Similar News