కరీంనగర్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు ఎంపీ బండి సంజయ్. నిన్న ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమ యాత్ర జరగకుండా సీఎంవో ఆదేశాల మేరకు పోలీసులు దాడికి పాల్పడినట్టు సంజయ్ ఆరోపించారు. లోకల్ పోలీసులను దూరంగా పెట్టి వేరే వారిని మఫ్టీలో తీసుకొచ్చి దాడులు చేయించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన వారు పోలీసులు కాదనే అనుమానం కూడా ఉందని సంజయ్ చెప్పారు. తనపై దాడి విషయంలో ప్రివిలేజ్ మోషన్ పెడతామన్నారాయన.