Motkupalli Narasimhulu: మోత్కుపల్లికి గ్రీన్ సిగ్నల్

Motkupalli Narasimhulu: మరో రెండు రోజుల్లో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్‌ లో చేరనున్నారు.

Update: 2021-10-05 14:37 GMT

Motkupalli Narasimhulu: మోత్కుపల్లికి గ్రీన్ సిగ్నల్

Motkupalli Narasimhulu: మరో రెండు రోజుల్లో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్‌ లో చేరనున్నారు. టీఆర్ఎస్ భవన్‌లో కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. పార్టీలో చేరిన తర్వాత మోత్కుపల్లికి దళిత బంధు పథకం అమలు చైర్మన్‌ పదవి కేటాయించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పదవి గురించి మోత్కుపల్లికి కేసీఆర్ నుండి స్పష్టమైన హామీ వచ్చినట్టు సమాచారం. ఇవాళ ఉదయం కేసీఆర్ మోత్కుపల్లిని అసెంబ్లీకి స్వయంగా వెంటబెట్టుకొచ్చారు. ఉదయం నుండి మోత్కుపల్లి సీఎం కేసీఆర్ తోనే ఉన్నారు.

Tags:    

Similar News