పైలెట్‌ పరిస్థితి విషమం.. హెల్త్ బులిటెన్ రిలీజ్

Update: 2019-11-12 09:09 GMT

కాచిగూడలో రైలు ప్రమాదంలో గాయపడిన ఎంఎంటీఎస్ ట్రైన్ లోకో పైలట్ చంద్రశేఖర్‌ ఆరోగ్య పరిస్తితి విషమంగా ఉంది. చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై కేర్ హస్పిటల్ వైద్యులు కొద్దిసేపటి క్రితం హెల్త్ బులిటెన్ రిలీజ్ చేశారు. క్రష్ ఇంజూరీస్ అయినట్లు వైద్యులు చెబుతున్నారు. కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిందని యూరిన్ అవుట్ పుట్ తగ్గిందని చెప్పారు. పక్కటెముకలు, మూత్రపిండం దెబ్బతిన్నాయని తెలిపారు. చంద్రశేఖర్ ప్రస్తుతం షాక్ లో ఉన్నారని ఇప్పుడే సర్జరీ చేయలమంటున్నారు. ఇదే ప్రమాదంలో గాయపడిన మరో ఐదుగురికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. 

Tags:    

Similar News