Gutha Sukender Reddy: దేశంలో బీజేపీ అరాచక పాలన సాగిస్తోంది

Gutha Sukender Reddy: బీజేపీ విధానాలతో ప్రజలు భయపడుతున్నారు

Update: 2022-01-04 06:36 GMT

దేశంలో బీజేపీ అరాచక పాలన సాగిస్తోంది

Gutha Sukender Reddy: దేశంలో బీజేపీ అరాచక పాలన సాగిస్తోందన్నారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని, రైతులను ఇబ్బందులకు గురి చేసేలా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

బీజేపీకి సీఎం కేసీఆర్ భయపడడం కాదు బీజేపీ విధానాలతో ప్రజలు భయపడుతున్నారన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేలా సీబీఐ, ఐటీ దాడులతో ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇదే పద్దతిని తెలంగాణలో చేయాలని చూస్తున్నారన్నారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి.

Tags:    

Similar News