తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

* ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ * ఏపీలో 2 ఉపాధ్యాయ, తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు * ఈ నెల 16న నోటిఫికేషన్‌... మార్చి 14న పోలింగ్

Update: 2021-02-11 08:46 GMT

Representational Image (the Hans India)

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది ఈసీ. ఏపీలో 2 ఉపాధ్యాయ, తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 16న నోటిఫికేషన్‌ విడుదల కానుండగా మార్చి 14న పోలింగ్ జరగనుంది. నామినేషన్‌ దాఖలుకు ఈ నెల 23 వరకు గడువు ఉండగా ఈ నెల 24న ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 26 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు కాగా మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 

Tags:    

Similar News